Monday, May 9, 2022

కేంద్ర పథకాలు

 ప్రధానమంత్రి ఫసల్ బీమా

-లక్ష్యం: అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం.
-రైతులకు సామాజిక భద్రత కల్పించడం.

ప్రయోజనాలు:
-నామమాత్రపు ప్రీమియంతో రైతులకు పంటల బీమా.
-ఖరీఫ్ సీజనలో ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం ప్రీమియం.
-ఖరీఫ్, రబీ సీజనలలో ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం


ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా

-లక్ష్యం: జీవిత బీమాతో భరోసా కల్పించడం

ప్రయోజనాలు
-18 నుంచి 50 ఏండ్ల వారికోసమే ఈ పథకం.
-రూ. 2 లక్షల జీవిత బీమా సదుపాయం.
-ఏడాదికి రూ. 330 ప్రీమియం అంటే రోజుకు రూ. 1 కంటే తక్కువ.
-బ్యాంకు ఖాతా తప్పనిసరి.
-ఈ పథకంలోని సభ్యులు ఏదైనా కారణంతో మృతిచెందితే వారి సంబంధీకులకు రూ. 2 లక్షల బీమా.
-ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలి.


ప్రధానమంత్రి సురక్ష బీమా

-లక్ష్యం: ప్రమాద బీమాతో భరోసా కల్పించడం.

ప్రయోజనాలు
-ఏడాదికి కేవలం రూ. 12 ప్రీమియంతో ప్రమాద బీమా.
-18 నుంచి 70 ఏండ్ల వయస్సు గల వారికి వర్తింపు.
-సేవింగ్స్ ఖాతాతో బీమా.
-ఆటో డెబిట్ సౌకర్యం.
-ప్రమాదంలో మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యాలుగా మారినా రూ. 2 లక్షల బీమా అందుతుంది.
-పాక్షిక వైకల్యం చెందితే రూ. లక్ష.


అటల్ పెన్షన్ యోజన

-లక్ష్యం: వృద్ధాప్యంలో ఆదాయ భద్రత.
-అసంఘటిత రంగంలోని 87 శాతం కార్మికులకు పింఛను.

ప్రయోజనాలు
-60 ఏండ్ల తర్వాత ప్రతి నెలా రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పింఛను.
-వయస్సును బట్టి ప్రీమియం.
-ఎస్‌పీఎస్ తరహాలో ఏపీవైని 18 నుంచి 40 ఏండ్ల వయస్సు గల వారికి వర్తింపు.
-పింఛను రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000గా వర్తింపు.
-కనీసం 20 ఏండ్లు జమ చేయాలి.
-ప్రభుత్వ ఉద్యోగులు, సీపీఎస్, ఇతర పథకంలో లేనివారు మాత్రమే అర్హులు.
-సభ్యుడి కాంట్రిబ్యూషన్‌లో 50 శాతం ప్రభుత్వం ఇస్తుంది.
-ప్రీమియం నెలకు కనిష్ఠంగా రూ. 42 నుంచి గరిష్ఠంగా రూ. 210.

No comments:

Post a Comment